Headlines

అంగరంగ వైభవంగా బీసీ కాలనీ యూత్ అసోసియేషన్ వినాయక నిమజ్జనం

చింతపల్లి,T6 న్యూస్: గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని చింతపల్లి బీసీ కాలనీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన మేరకు చింతపల్లి గ్రామ ప్రజల సమక్షంలో పద్ధతుల ప్రకారం కార్యక్రమాలను నిర్వహించి శోభయాత్రతో నిమజ్జనం నిర్వహించారు. ప్రతి సంవత్సరం సుదూర ప్రాంతాల వారు ఎక్కడ ఉన్నా గణపతి నిమజ్జనానికి తప్పకుండా హాజరవుతారని యువ నాయకులు గోవింద్ యాదగిరి పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా బీసీ కాలనీ గణేశ…

Read More

గంగమ్మ ఒడికి గణనాదులు

చింతపల్లి, T6న్యూస్: చింతపల్లి మండల కేంద్రంలో కొలువై ఉన్న గణపతులు శనివారం నవరాత్రులు ముగియడంతో అంగరంగ వైభవంగా శోభాయాత్రలతో గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాయి. వివరాల్లోకి వెళితే చింతపల్లి మండల కేంద్రంలో మీ పాత గ్రామంలో కొలువై ఉన్న శివాలయం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లడ్డు వేలం పాటలో భాగంగా పెద్ద లడ్డును లాటరీ సిస్టం ద్వారా కొనసాగించారు. 200 మంది భక్తులు పెద్ద లడ్డుకు పోటీపడి టోకెన్లు…

Read More

ఈ నెల 5న గ్రామ పాలన అధికారులకు నియామక పత్రాలు

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్: ఈ నెల 5 వ తేదీన హైదరాబాద్ లోని హైటెక్స్ లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రామ పాలన అధికారుల(జీపీఓ)కు నియామక పత్రాలు అందజేయబడతాయని, జీపీఓలుగా ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ కు వచ్చేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ సూచించారు. జీపీఓ అభ్యర్థులు హైదరాబాద్ వెళ్ళడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ…

Read More

టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి.

హైదరాబాద్, T6 న్యూస్:టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని టీబీ వ్యాధి బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త పడాలని ఆగాపుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం జ్యోత్స్న అన్నారు. గురువారం నేతాజీ నగర్ లోని అంగన్వాడి కేంద్రంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు టీబీ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించారు. రోగులకు మందులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..టీబీ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త…

Read More

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం – కామన్వెల్త్ గేమ్స్‌ కోసం భారత్‌ బిడ్

డిల్లీ,T6 న్యూస్: కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణలో భారత్‌ మరోసారి ముందడుగు వేసింది. 2030 కామన్వెల్త్ గేమ్స్‌ నిర్వహణకు భారత్‌ తరఫున బిడ్ వేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో క్రీడా రంగం ఉత్సాహభరితంగా మారింది. ఇప్పటికే భారత ఒలింపిక్ సంఘం (IOA) 2030 గేమ్స్‌ కోసం భారత్‌ను ఆతిథ్య దేశంగా ప్రతిపాదించేందుకు అంగీకరించింది. కేబినెట్‌ ఆమోదంతో ఇప్పుడు అధికారికంగా బిడ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణకు భారత్‌తో పాటు నైజీరియా, కెనడా,…

Read More

ఖమ్మం-బోనకల్ మధ్య రాకపోకలు బంద్

ఖమ్మం,T6 న్యూస్: ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో వరద ఉధృతి తీవ్రంగా ఉంది. కట్టలేరు వాగు ఉప్పొంగిపోవడంతో పరిసర గ్రామాల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా రామకృష్ణాపురం వద్ద వాగు మీద ఉన్న వంతెన నీటమునిగిపోవడంతో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. 🔹 ప్రధాన అంశాలు: కట్టలేరు వాగు వరద ప్రవాహం కారణంగా రామకృష్ణాపురం దగ్గర వంతెన మునిగింది. ఫలితంగా ఖమ్మం–బోనకల్ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గాన్ని ఉపయోగించే వందలాది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు నీటి…

Read More

నంద్యాల త్యాగరాజ స్వామి దేవస్థానం నందు ఘనంగా వినాయక చవితి వేడుకలు.

నంద్యాల,T6 న్యూస్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజ స్వామి దేవస్థానం నందు చైర్మెన్/అధ్యక్షులు ఊడుమాల్పురం మల్లుగాల్ల సుబ్బరాయుడు, ట్రెజరర్ శీనయ్య ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించారు. మన దేవాలయంలో తెల్లవారుజామున నుంచే శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పత్ర, ఫల, పుష్పాలు మరియు తోరణాలతో విశేషంగా అలంకరించారు. విచ్చేసిన భక్తాదులందరూ…

Read More

గణనాథున్ని దర్శించుకున్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ,T6 న్యూస్: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దరామాలయం శ్రీ మల్లికార్జున సీతారామ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని ప్రజా ప్రతినిధులతో కలిసి సందర్శించి, గణనాథుని దర్శించుకొని,ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గణేష్ ఉత్సవ కమిటి నిర్వాహకులు, అర్చకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విఘ్నాలను తొలగించి విజయపథంలో నడిపించే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు ప్రతి…

Read More

కేవలం ఆ 4 గంటలు మాత్రమే సౌండ్ సిస్టమ్.. రోడ్డుకు అడ్డంగా ఉండొద్దు.. హైకోర్టు సంచలన ఆదేశాలు

హైదరాబాద్,T6 న్యూస్: నేడు దేశ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల కోసం ఊరూవాడా ముస్తాబయ్యాయి. అయితే ఉత్సవాల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు నిబంధనలు విధించింది. సికింద్రాబాద్ ఎంఈఎస్ కాలనీకి చెందిన ప్రభావతి అనే మహిళ తన ఇంటికి ఆనుకుని మండపాలు ఏర్పాటు చేశారంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఇంకా పలువురు సైతం గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో పిటిషన్లు వేశారు. పిటిషనర్ల అభ్యంతరాలను పరిష్కరించాలని హైకోర్టు అధికారులను గతంలో ఆదేశించింది. అయినా పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కరణ…

Read More

యూఎస్ టారిఫ్‌లతో భారత్‌కు భారీ నష్టం

అమెరికా విధించిన 50% సుంకాలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నాయి. దీనివల్ల భారతదేశానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాకు భారత్ నుండి ఎగుమతి అవుతున్న $60.2 బిలియన్ల విలువైన సరుకులు $18.6 బిలియన్లకు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, అలాగే జీడీపీ 0.2 నుండి 0.5% వరకు తగ్గుతుందని నిపుణులు పేర్కొన్నారు. టెక్స్‌టైల్, సముద్ర ఆహారం, లెదర్, ఫుట్‌వేర్, కెమికల్స్,…

Read More