Headlines

బోనమెత్తిన మాజీ జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి

రంగారెడ్డి,T6 న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్లలో ఆదివారం అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారికి బోనాలు జరిగాయి. మంచాల మండల మాజీ జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా మర్రి నిత్య నిరంజన్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ గ్రామ దేవత శ్రీ పోచమ్మ అమ్మవారి చల్లని దీవెనలతో ప్రజలందరూ పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో, సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆదిభట్ల గ్రామ ప్రజలు బంధుమిత్రులు పెద్ద…

Read More

కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు వేదిరే సికిందర్ రెడ్డి ఇబ్రహీంపట్నం,T6న్యూస్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ కౌశిక్ రెడ్డిపై చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని ఆదివారం ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్ రెడ్డికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెదిరె సికింధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని…

Read More

గోవా కొత్త గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణం

పనాజి: ప్రముఖ రాజనీతి నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గోవా రాష్ట్ర నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గోవా రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన ఘన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణం చేశారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, సంద్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి హాజరుతో ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా…

Read More

అడిగిన వరాలిచ్చేఅన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి

జులై 26 శనివారం శ్రీ సత్య నారాయణ స్వామి అవిర్భావం సందర్భంగా… 🚩తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం దేవాలయం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. 🚩శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారు వెలసిన దివ్యదామం. ఇక్కడ ప్రతి నిత్యం నిత్య కల్యాణం పచ్చతోరమే. ప్రతి రోజు ఈ క్షేత్రం భక్తులతో కిట కిటలాడుతుంటుంది. స్వామివారు భక్తులతో కొలుపులందుకుంటూ కళ కళలాడుతుంటాడు. 🪷 శ్రీసత్యనారాయణ స్వామి ఆవిర్భవించిన శ్రావణ శుద్ధ విదియ రోజున ఇక్కడ విశేష పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు….

Read More

శ్రీవారి పాదములు

వేంకటేశ్వరుడ్ని కలియుగ దైవంగా భావిస్తారు.ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు.ఆయన్ను దర్శనం చేసుకోడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడ్డం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది లేదనుకుంటారు.శ్రీహరి సంపూర్ణదర్శనంతో మోక్షం లభించినట్టే ఫీలవుతారు.అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోడంతో పాటు- పాదాలను కూడా వీక్షించాలి.దీన్నే నిజపాద దర్శనం అంటారు. శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత…

Read More

స్వశక్తిని చాటండి.. కోటి వెలుగులు అందుకోండి..

మహిళలతో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ పరిధిలో 3,418 చెక్కులు అందజేత.. చెక్కుల విలువ 3.29 కోట్లు.. మంత్రికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, నాయకులు.. కార్యక్రమానికి హాజరైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జోరుగా.. హుషారుగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం రంగారెడ్డి,షాద్ నగర్ : ప్రభుత్వం అన్ని రంగాలలో మహిళలకే పెద్ద పీట వేసింది.. ఉపాధి దిశగా వారిని ఉన్నతికి చేర్చేందుకు రంగం సిద్ధం…

Read More

తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో దాశరథి శతజయంతి ఉత్సవం

హైదరాబాద్: దాశరధి పుట్టి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంలో వారి శత జయంతి ఉత్సవాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని గత సంవత్సర కాలం నుంచి ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి విజ్ఞప్తి చేస్తూ వస్తుంది. గొప్పకవి దాశరధి గారు ఆయన వేడుకలు , ఘనంగా నిర్వహించాలని, శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తూ వచ్చింది. దాశరధీ గారి ఉత్సవాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించలేదు. దాశరధీకి ఈ ప్రభుత్వం సరేనా గౌరవం ఇవ్వలేదని…

Read More

ఘనంగా లింగోటంలో పీర్ల పండుగ

కనగల్, T6 న్యూస్: మండలంలోని ఎస్ లింగోటం గ్రామంలో ఆదివారం పీర్ల పండుగను భక్తులు, గ్రామస్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున డప్పు చప్పులు మేళ తాళాలు మధ్య ఊరేగింపు నిర్వహించారు. భక్తులు సవార్లకు నీళ్ళారా పోసి దట్టీలు గట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలా ఉంటే పీర్ల పండుగ ముతాబలీలు హల్వా వేడుకలను ముందుగా నిర్వహించారు. ఆదివారం ఉదయం కాసిం సవార్ను ఇంటింటికి తిరుగుతూ ఊరేగింపు జరిపారు. కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ అజీజ్, ముతాబలీలు మట్టపల్లి…

Read More

తిరుమలకు ఉన్న 8 వాడుకదారులు

తిరుమల, T6 న్యూస్: సాధారణంగా మనకు తెలిసినంత వరకు అలిపిరి మెట్ల మార్గం ఒకటి. రెండోది శ్రీవారి మెట్టు మార్గం. ప్రస్తుతం అలిపిరి మరియు శ్రీవారి మెట్టు మార్గం మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా తిరుమల చేరుకోవడానికి రెండు ఘాట్ రోడ్డుఉన్నాయి. అప్పుడప్పుడు కడపజిల్లా వాసులు గుంపులు గుంపులుగా మామండూరు ప్రాంత్రం నుంచి నడకమార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. హిందువులు దర్శించే పుణ్యక్షేత్రాలలో అతి మహిమ గలది కలియుగ వైకుంఠం అయిన తిరుమల….

Read More

భారీగా నకిలీ ఎలక్ట్రికల్ సామాగ్రి స్వాధీనం..

బ్రేకింగ్:వరంగల్ జిల్లా తెలంగాణ.వరంగల్ నగరంలో నకిలీ ఎలక్ట్రికల్ వైర్ లు, స్విచ్ లు, ఇతర సామాగ్రి డూప్లికేట్ సరుకులు అమ్ముతున్న పలు మర్వాడీలు… పలుమార్వాడి దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్, లక్షల రూపాయలు సరుకులు స్వాధీనం… రాష్ట్రం మొత్తం ఇలానే ఉంది… ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పాతుకుపోయిన మార్వాడీలు…కుదేళ్లు అవుతున్న స్థానిక వ్యాపారస్తులు…పేరుకే స్థానిక వ్యాపారస్తుల యూనియన్లు…మార్వాడీల మోచేతి నీళ్లు తాగి స్థానిక వ్యాపారస్తుల పొట్ట కొడుతున్న యూనియన్ల లీడర్లు…అతి తక్కువ ధరకే డూప్లికేట్ వస్తువులు…

Read More