Headlines

బోనమెత్తిన మాజీ జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి

రంగారెడ్డి,T6 న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్లలో ఆదివారం అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారికి బోనాలు జరిగాయి. మంచాల మండల మాజీ జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా మర్రి నిత్య నిరంజన్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ గ్రామ దేవత శ్రీ పోచమ్మ అమ్మవారి చల్లని దీవెనలతో ప్రజలందరూ పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో, సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆదిభట్ల గ్రామ ప్రజలు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share