Headlines

ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్ -2 కు దామన్న పేరు : సీఎం రేవంత్

నల్గొండ/సూర్యాపేట,T6 న్యూస్: ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్ -2 కు దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి(దామన్న) ఎస్సార్ఎస్పీ-2గా నామకరణం చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. తుంగతుర్తిలో జరిగిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ❇️ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ వారు సేవలను స్మరించుకున్నారు. “రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి మ‌ర‌ణం అత్యంత బాధాక‌రం. పార్టీ కోసం, కార్యకర్తల కోసం సొంత ఆస్తులను త్యాగం చేసిన నిస్వార్థ నాయకుడు. అయిదు…

Read More

ఫార్మాలో మరో భారీ పెట్టుబడి

హైదరాబాద్,T6 న్యూస్ :ఫార్మా రంగంలో దిగ్గజ సంస్థ ఎలి లిల్లీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాల విస్తరణ కోసం 9 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తో సమావేశమైన ఎలీ లిల్లీ ప్రతినిధి బృందం ఆ మేరకు అంగీకారం తెలియజేసింది. ❇️ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎలీ లిల్లీ అండ్ కో (Eli Lilly and Co) ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్ గారు, సంస్థ ఇండియా ప్రెసిడెంట్ విన్స్‌లో టూకర్…

Read More

కాంగ్రెస్ పార్టీకి షాక్

“బిఆర్ఎస్ పార్టీ లో బారీగా చేరికలు“-బిఅర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం-కాంగ్రెస్‌ ఏడాది పాలనలో తెలంగాణలో సబ్బండవర్గాలు ఆందోళన బాట పట్టాయి.-స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో పదేండ్ల పాటు అభివృద్ధి మార్గంలో పరుగులు తీసిన తెలంగాణ..-నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వల్ల సంక్షోభంలో కూరుకుపోయింది.-నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు రోడ్డెక్కారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.-ప్రజాపాలన అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన హస్తం పార్టీ నేతలు తెలంగాణలో సమస్యలను చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు.-ఎన్నికలకు…

Read More

ముస్లిం మైనార్టీల కొత్త స్కీమ్స్‌ గైడ్‌లైన్స్‌ జారీ

హైదరాబాద్,T6 న్యూస్: ముస్లిం మైనార్టీల కోసం కొత్తగా తెచ్చిన ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’, ‘రేవంతన్న కా సహారా..మిస్కీన్‌ కే లియే’ స్కీమ్స్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హుల ఎంపిక, దరఖాస్తు విధానం తదితర అంశాలను తెలియజేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫకీర్, దూదేకుల, ఇతర పేద ముస్లిం మైనారిటీ వర్గాల కోసం ఈ రెండు పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ కింద ముస్లిం వితంతువులు, విడాకులు పొందినోళ్లు,…

Read More

చింతమడకకు కవిత..

చింతమడకలో జరిగే బతుకమ్మ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు మార్గమధ్యలో సిద్దిపేట పట్టణంలో ఘన స్వాగతం పలికిన జాగృతి నాయకులు, కార్యకర్తలు, మహిళలు.

Read More

ఎంగిలిపూల బతుకమ్మ తో పండుగ మొదలైంది

హైదరాబాద్,T6 న్యూస్: ఎంగిలిపూల (వివిధ రకాల పూలు) బతుకమ్మ తో పండుగ మొదలైంది.బతుకమ్మ అంటే “బతుకు అమ్మ” అని అర్ధం, ఇది మహిళల సంతోషాన్ని, వారి ఐక్యతను చాటి చెబుతుంది. నగరంలో లో బతుకమ్మ పండుగ కోలహాలంగా వివిధ బస్తీలలో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు పాటలు పాడుతూ ఆడారు.బతుకమ్మ పండుగ పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి ఆరాధనకు ఈ పండుగ ఒక గొప్ప ఉదాహరణ.బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత:బతుకమ్మ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే…

Read More

సీఎం రేవంత్ తో హైకోర్టు చీఫ్ జస్టిస్ భేటీ

హైదరాబాద్,T6 న్యూస్ : రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, న్యాయస్థానాల్లో సిబ్బంది నియామకం వంటి అంశాలపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ , ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ♦️రాష్ట్రంలో ముఖ్యంగా కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు, మౌలిక వసతులను కల్పించడంతో పాటు అవసరమైన మేరకు సిబ్బంది నియామకాలను చేపట్టాలని జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సూచించారు. ఈ అంశాలకు సంబంధించి పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి…

Read More

గురు నానక్ యూనివర్సిటీలో ఘనంగా 2వ ఒరియంటేషన్ డే..

రంగారెడ్డి, T6 న్యూస్: ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ యూనివర్సిటీ 2025 – 2026 సంవత్సరానికి సంబంధించి క్యాంపస్‌లో BBA మరియు BCA కోర్సుల్లో చేరిన కొత్త విద్యార్థుల కోసం రెండవ ఒరియంటేషన్ డే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. డా. హెచ్.ఎస్. సైనీ, వైస్ ఛాన్సలర్, ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు తమ సామర్థ్యాలను గుర్తించుకొని, విద్యను ప్రయోజనకరంగా మలచుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా యూనివర్సిటీ ఛాన్సలర్ సర్దార్ గగన్‌దీప్ సింగ్ కోహ్లీ తన సందేశం ద్వారా విద్యార్థులు…

Read More

అంగరంగ వైభవంగా బీసీ కాలనీ యూత్ అసోసియేషన్ వినాయక నిమజ్జనం

చింతపల్లి,T6 న్యూస్: గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని చింతపల్లి బీసీ కాలనీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన మేరకు చింతపల్లి గ్రామ ప్రజల సమక్షంలో పద్ధతుల ప్రకారం కార్యక్రమాలను నిర్వహించి శోభయాత్రతో నిమజ్జనం నిర్వహించారు. ప్రతి సంవత్సరం సుదూర ప్రాంతాల వారు ఎక్కడ ఉన్నా గణపతి నిమజ్జనానికి తప్పకుండా హాజరవుతారని యువ నాయకులు గోవింద్ యాదగిరి పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా బీసీ కాలనీ గణేశ…

Read More

గంగమ్మ ఒడికి గణనాదులు

చింతపల్లి, T6న్యూస్: చింతపల్లి మండల కేంద్రంలో కొలువై ఉన్న గణపతులు శనివారం నవరాత్రులు ముగియడంతో అంగరంగ వైభవంగా శోభాయాత్రలతో గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాయి. వివరాల్లోకి వెళితే చింతపల్లి మండల కేంద్రంలో మీ పాత గ్రామంలో కొలువై ఉన్న శివాలయం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లడ్డు వేలం పాటలో భాగంగా పెద్ద లడ్డును లాటరీ సిస్టం ద్వారా కొనసాగించారు. 200 మంది భక్తులు పెద్ద లడ్డుకు పోటీపడి టోకెన్లు…

Read More