అధికారులు అందరు అప్రమత్తంగా ఉండాలి. సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సచివాలయం: రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్తో పాటు భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరక్కుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ⛈️ రానున్న 72 గంటల్లో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లో…
