Headlines

5ఏళ్ళు దాటాక పిల్లల ఆధార్ అప్డేట్ తప్పనిసరి..!!

7 ఏళ్లు దాటినా చేయకపోతే డీ యాక్టివేట్‌ ఢిల్లీ: బాల ఆధార్‌ తీసుకున్న పిల్లలు ఐదేళ్ల తర్వాత తప్పనిసరిగా వేలిముద్రలు, కనుపాపలు, ఫొటో అప్‌డేట్‌ చేయాలని, లేకపోతే వారి ఆధార్‌ డీ యాక్టివేట్‌ అవుతుందని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పేర్కొంది. ఐదేళ్ల లోపు పిల్లలకు బయోమెట్రిక్‌, ఐరిస్‌ అవసరం లేకుండా కేవలం ఫొటో మాత్రమే తీసుకొని యూఐడీఏఐ బాల ఆధార్‌ ఇస్తోంది. అటువంటి పిల్లలు ఏడేళ్లు దాటక మునుపే తప్పనిసరి వారి బయోమెట్రిక్‌, ఐరిస్‌,…

Read More

మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుకు 14రోజుల రిమాండ్..

హైదరాబాద్‌, జూలై 16: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన తెలంగాణ రాష్ట్ర మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్‌రావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఇటీవల జరిగిన ఏసీబీ సోదాల్లో భారీ ఆస్తులు, విలాసవంతమైన వాహనాలు, భారీ మొత్తంలో నగదు, బంగారం వెలుగులోకి రావడంతో ఆయనను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు హైదరాబాదులోని కొండాపూర్‌లో ఉన్న మురళీధర్‌రావు నివాసంతో పాటు కరీంనగర్, జహీరాబాద్ ప్రాంతాల్లోని ఆయన ఆస్తులపై సోదాలు నిర్వహించారు. ఇందులో…

Read More

ఇవాళ్టి కేంద్ర జలశక్తి సమావేశంపై సస్పెన్స్..

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య నీటి పంపకాలపై మరోసారి వివాదం రాజుకుంది. బుధవారం నాడు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరుగనున్న కీలక సమావేశంపై తుది నిమిషంలో సస్పెన్స్ నెలకొంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆహ్వానించారు.కేంద్రం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్ట్‌ను ముఖ్యంగా చర్చించాలని ఎజెండాలో పేర్కొనగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనికి తలకిందులుగా స్పందించింది. బనకచర్లపై…

Read More

ఆశ్రమ పాఠశాలను అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్..

దేవరకొండ, T6 న్యూస్: దేవరకొండ మండలంలోని ముదిగొండ కమలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను RDO రమణా రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్హాస్టల్ మరియు పాఠశాల పరిసరాలు,తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని,విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.పాఠశాల పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు తొలగించాలని, పరిశుభ్రంగా ఉంచాలని…

Read More

ఐటీ సెక్టార్‌లో డ్రగ్ మాఫియాపై డెకాయ్‌ ఆపరేషన్‌..

హైదరాబాద్‌, జూలై 14:ఐటీ సెక్టార్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న మాదకద్రవ్య ముఠాపై నార్కోటిక్‌ విభాగం భారీ డెకాయ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. ఈ నెల 12న నిర్వహించిన గుప్త ఆపరేషన్‌లో నిందితుడి సెల్‌ఫోన్‌ లభ్యం కావడంతో కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడి ఫోన్‌లో 100 మందికి పైగా గంజాయి వినియోగదారుల వివరాలు ఉన్నట్లు వెల్లడైంది.ఎస్పీ చెన్నూరి రూపేష్‌ వెల్లడించిన వివరాల ప్రకారం –వారానికి ఒకసారి “సందీప్‌” అనే వ్యక్తి ఐటీ కార్యాలయాల సమీపానికి వచ్చి…

Read More

కొత్త రేషన్ కార్డుల పంపిణీ వేళ.. సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్..!

హైదరాబాద్, T6 న్యూస్: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది.రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు సీఎం. ‘సన్నబియ్యంతో తెలంగాణ పల్లెల్లోని రేషన్ షాపుల వద్ద సందడి సంతరించుకుంది. కొత్త రేషన్ కార్డుల కోసంపేదవాడి పదేళ్ల ఎదురు చూపులు నేడు ఫలించబోతున్నాయి. రాష్ట్రంలో 5.61 లక్షల…

Read More

పచ్చని కాపురంలో బుట్టబొమ్మ చిచ్చు.. వరంగల్లో విషాదం

వరంగల్: పర స్త్రీ వ్యామోహం పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పెళ్లి నాటి ప్రమాణాలకు కొందరు విలువ లేకుండా చేస్తున్నారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన ఆలుమగలు ఈ పక్క చూపుల మూలాన అర్థాంతరంగా విడిపోతున్నారు. ఇంకొందరు చంపేందుకు వెనకాడటం లేదు. మరికొందరు కలలన్నీ చెదిరిపోయాయనే నిరాశతో నిండు నూరేళ్ల జీవితానికి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేసి తనువు చాలిస్తున్నారు. వరంగల్ పరిధిలో ఇలాంటి ఘటనే జరిగింది.వరంగల్లో ప్రత్యూష అనే వైద్యురాలి ఆత్మహత్య ఘటన కలకలం…

Read More

మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు : గోవాకు అశోక్ గజపతిరాజు

ఢిల్లీ, T6 న్యూస్ : కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్ల నియామకాలను ఆమోదించారు.హర్యానా, గోవాతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ లకు కొత్త గవర్నర్లను నియమించినట్లు రాష్ట్రపతి భవన్ సోమవారం (జులై 14) ప్రకటన వెలువరించింది.కొత్త గవర్నర్లలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా నియామకం అయ్యారు. హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్ అషిమ్…

Read More

మల్లన్నకు కవిత వార్నింగ్

–శాసనమండలి చైర్మన్ గుత్తాకు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు.. హైదరాబాద్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫిర్యాదు చేశారు. మండలి ఛైర్మన్ ఇంటికెళ్లి మరీ ఎమ్మెల్సీ ఫిర్యాదు చేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుగోబోమని తీన్మార్ మల్లన్నను ఈ సందర్భంగా కవిత హెచ్చరించారు. మహిళలు రాజకీయాల్లో మాట్లాడకూడదా? అంటూ ప్రశ్నించారు.ప్రజలపై కాల్పులు జరిపేంత క్రూరత్వం ఏంటి? అని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం…

Read More

రేషన్‌ కార్డులు, ఇళ్ల పంపిణీపై మంత్రి పొంగులేటి ప్రకటన

ఖమ్మం,T6న్యూస్: ఖమ్మం జిల్లాలో ప్రజలతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఇప్పటివరకు 3.54 లక్షల రేషన్‌ కార్డులు మంజూరు చేశామని ఆయన వెల్లడించారు. పదేళ్ల పాలనలో BRS ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటివరకు 3.54 లక్షల రేషన్…

Read More