Headlines

ములుగు నియోజకవర్గ దేవాలయాల అభివృద్ధికి రూ.1.42 కోట్లు మంజూరు

ములుగు నియోజకవర్గంలోని పలు పురాతన దేవాలయాల అభివృద్ధి కోసం రూ.1.42 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం -మంత్రి సీతక్క విజ్ఞప్తిపై సీజీఎఫ్ నిధుల నుంచి మంజూరైన నిధులు-అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ . గోవిందరావుపేట మండలంలోని బుస్సాపూర్ జానకిరామాలయంకు – రూ.12 లక్షలు. కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయంకు – రూ.50 లక్షలు. ములుగు మండలం జగ్గన్నపేట పుట్ట మల్లిఖార్జున స్వామి దేవాలయంకు – రూ.30 లక్షలు. మల్లంపల్లి వెంకటేశ్వర స్వామి…

Read More

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

నంద్యాల, T6 న్యూస్ : శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఉపరితల జలాశయాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దాంతో జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ప్రస్తుత జలస్థితి: ఇన్‌ఫ్లో (ప్రవాహం): 1,00,085 క్యూసెక్కులు పూర్తిస్థాయి నీటిమట్టం (FRL): 885 అడుగులు ప్రస్తుతం నీటిమట్టం: 874.30 అడుగులు నిక్షేప సామర్థ్యం: సుమారు 215 టీఎంసీలు ప్రస్తుత జలమట్టానికి ఉన్న నీటి నిల్వ: సుమారు 175 టీఎంసుల మేరగా అంచనా విద్యుత్…

Read More

నేడు కుమార షష్ఠి..

హైదరాబాద్, T6 న్యూస్ డెస్క్: షణ్మతాలలో కుమారోపాసన (సుబ్రహ్మణ్యోపాసన) ఒకటి. మిగిలినవి సౌర , శాక్త , వైష్ణవ , గాణాపత్య , శైవములు. అయితే అగ్ని గర్భుడు అని పేరు ఉన్న సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే జరుగుతుందని శాస్త్ర వాక్యము. అందుచేతనే పంచాయతన పూజలో ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్య స్వామి వారి మూర్తి ఉండదు. అయితే దీపారాధన శివశాక్త్యాత్మకుడైన అగ్నిసంభవుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించడమేనని పెద్దలు చెప్తారు. ఈ విధంగా వైదిక ధర్మం లో సుబ్రహ్మణ్యోపాసన చెప్పబడింది. మనకి…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ నివేదికలో సంచలన విషయాలు..

హైదరాబాద్‌, T6న్యూస్: తెలంగాణలోని భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌గా పరిగణించబడే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కమిషన్‌కు అందించారు. ఇందులో ప్రాజెక్టు ప్రారంభం, అనుమతుల విధానం, కేబినెట్ చర్చల గురించి కొన్ని తేలికపాటి కాకుండా వివాదాస్పద అంశాలు వెల్లడయ్యాయి. నివేదికలో ముఖ్యాంశాలు: 🔹 కాళేశ్వరం ప్రాజెక్టును కేబినెట్‌లో ఎప్పుడూ చర్చించలేదని నివేదిక స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగ పరంగా, పరిపాలనా…

Read More

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త..

అమరావతి,T6news: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త అందనున్నది. సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో పోరాటం చేస్తూ ఉన్న వీరి సమస్యలను పరిష్కరించేందుకు నూతన ప్రభుత్వం సంసిద్ధమైంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గురుకుల ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి బాధలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వేతనాల పెంపు అవసరాన్ని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కఠినమైనప్పటికీ, ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ…

Read More

తిరుమల సర్వస్వం – 2

శ్రీవారి సేవలు 💐 ప్రస్తుతం సంవత్సరానికి 450 కు పైగా ఉత్సవాలు జరుగుతాయి. 💐 నిత్య, వార, పక్ష, త్రైమాసిక, వార్షిక ఉత్సవాలు ఎన్నో, ఎన్నెన్నో… సుప్రభాతసేవ 💐 29 శ్లోకాలున్న “సుప్రభాతము” 💐 11 శ్లోకాలున్న “స్తోత్రము” (కమలాకుచ చూచుక కుంకుమతో…), 💐 16 శ్లోకాలున్న “ప్రపత్తి” నీ (ఈశానాం జగతో…), 💐 14 శ్లోకాలున్న “మంగళాశాసనాన్ని” (శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే…), (రేపటి భాగంలో…. విశ్వరూప సందర్శనం, నవనీత హారతి, తిరుప్పావై పఠనం వివరాలు)

Read More

ప్రధాని విదేశీ పర్యటన..

జులై 2 నుంచి 9 వరకు ప్రధాని మోదీ 8 రోజుల విదేశీ పర్యటన హైదరాబాదు,T6న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. జులై 2వ తేదీ నుంచి ఎనిమిది రోజుల పాటు రెండు ఖండాల్లోని ఐదు దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలను సందర్శిస్తారు. బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడంతో పాటు, గ్లోబల్ సౌత్‌లోని కీలక దేశాలతో ద్వైపాక్షిక…

Read More

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

హైదరాబాదు,T6న్యూస్: సోమవారం రోజున బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఏమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఏమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డికి పాలకవర్గం ఘన స్వాగతం పలికారు.మార్కెట్ కార్యాలయం ముందు మొక్కను నాటి మార్కెట్ కి సంబంధించిన కార్యక్రమాలను త్వరలో చేపట్టబోయే కోహెడ మార్కెట్ కి సంబంధించిన ప్రాజెక్టు పనులను పవర్…

Read More

బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

హైదరాబాద్,T6న్యూస్: తెలంగాణ రాజకీయ వేడి మరింతగా పెరుగుతున్న వేళ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి మరియు బీజేపీ సీనియర్‌ నేత బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నేతలు చేస్తున్న ప్రచారాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. 🔹 అధ్యక్ష పదవిపై స్పష్టత: “బీజేపీ అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ పడవచ్చు. అది ప్రజాస్వామ్య పార్టీ. కానీ ఎవరికీ పదవి రాకపోయినంత మాత్రాన వారు డమ్మీలు కారు,” అంటూ…

Read More

బీజేపీకి శక్తిని చేకూర్చేందుకు కృషి చేస్తాను – రాంచందర్‌రావు

హైదరాబాద్‌,T6న్యూస్: మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పార్టీ నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. నాకు ఈ బాధ్యత చాలా గొప్పది, అదే సమయంలో సవాళ్లతో కూడుకున్నది. ప్రజల ఆశలు తీర్చే విధంగా పని చేస్తాను,” అని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీకి అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనలతో ప్రజలు విసిగిపోయారనీ, ప్రజల్లో స్పష్టమైన మార్పు కోరుకునే భావన నెలకొన్నదని…

Read More