రేపటి నుంచి మహిళలకు చీరల పంపిణి
హైదరాబాద్ :మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో పాటు ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరను అందించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కోసం చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారు….
