Headlines

బీజేపీ కేంద్ర కమిటీ సమావేశం

ఢిల్లీ,T6 న్యూస్: బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, లక్ష్మణ్‌ సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై విస్తృతంగా చర్చ జరిగింది. అభ్యర్థుల జాబితాను తుది దశకు తీసుకెళ్లి, ఆమోదం తెలపనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా,…

Read More

హెచ్‌1-బీ వీసా ఫీజులపై వైట్‌హౌస్‌ స్పష్టత

వాషింగ్టన్‌, T6 న్యూస్: అమెరికాలో ఉద్యోగావకాశాల కోసం అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న హెచ్‌1-బీ వీసాలపై ఫీజు పెంపు అంశంపై వైట్‌హౌస్‌ కీలక స్పష్టతనిచ్చింది. ప్రస్తుత వీసాలు కలిగినవారికి, వాటి పునరుద్ధరణ (రిన్యువల్‌) సందర్భాల్లో ఎటువంటి పెంపు ఉండదని స్పష్టం చేసింది. కొత్త వీసా దరఖాస్తుదారులకే లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుందని తెలిపింది. 2025 లాటరీ ద్వారా మంజూరయ్యే వీసాల విషయంలోనూ పాత ఫీజులే కొనసాగుతాయని వైట్‌హౌస్‌ అధికారి వివరించారు. కొత్తగా ప్రవేశపెట్టిన లక్ష డాలర్ల ఫీజు జీవితకాలానికి…

Read More

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం – కామన్వెల్త్ గేమ్స్‌ కోసం భారత్‌ బిడ్

డిల్లీ,T6 న్యూస్: కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణలో భారత్‌ మరోసారి ముందడుగు వేసింది. 2030 కామన్వెల్త్ గేమ్స్‌ నిర్వహణకు భారత్‌ తరఫున బిడ్ వేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో క్రీడా రంగం ఉత్సాహభరితంగా మారింది. ఇప్పటికే భారత ఒలింపిక్ సంఘం (IOA) 2030 గేమ్స్‌ కోసం భారత్‌ను ఆతిథ్య దేశంగా ప్రతిపాదించేందుకు అంగీకరించింది. కేబినెట్‌ ఆమోదంతో ఇప్పుడు అధికారికంగా బిడ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణకు భారత్‌తో పాటు నైజీరియా, కెనడా,…

Read More

కేవలం ఆ 4 గంటలు మాత్రమే సౌండ్ సిస్టమ్.. రోడ్డుకు అడ్డంగా ఉండొద్దు.. హైకోర్టు సంచలన ఆదేశాలు

హైదరాబాద్,T6 న్యూస్: నేడు దేశ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల కోసం ఊరూవాడా ముస్తాబయ్యాయి. అయితే ఉత్సవాల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు నిబంధనలు విధించింది. సికింద్రాబాద్ ఎంఈఎస్ కాలనీకి చెందిన ప్రభావతి అనే మహిళ తన ఇంటికి ఆనుకుని మండపాలు ఏర్పాటు చేశారంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఇంకా పలువురు సైతం గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో పిటిషన్లు వేశారు. పిటిషనర్ల అభ్యంతరాలను పరిష్కరించాలని హైకోర్టు అధికారులను గతంలో ఆదేశించింది. అయినా పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కరణ…

Read More

యూఎస్ టారిఫ్‌లతో భారత్‌కు భారీ నష్టం

అమెరికా విధించిన 50% సుంకాలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నాయి. దీనివల్ల భారతదేశానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాకు భారత్ నుండి ఎగుమతి అవుతున్న $60.2 బిలియన్ల విలువైన సరుకులు $18.6 బిలియన్లకు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, అలాగే జీడీపీ 0.2 నుండి 0.5% వరకు తగ్గుతుందని నిపుణులు పేర్కొన్నారు. టెక్స్‌టైల్, సముద్ర ఆహారం, లెదర్, ఫుట్‌వేర్, కెమికల్స్,…

Read More

శ్రీవారి ఆలయం మూసివేత

చంద్ర గ్రహణం కారణంగాసెప్టెంబర్ 7 సాయంత్రం 3.30 గంటల నుండి సెప్టెంబర్ 8 ఉదయం 3 గంటల వరకు దాదాపు 12గం పాటు మూసివేత తిరుమల శ్రీవారి ఆలయం మూత చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3.30 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున అనగా సెప్టెంబర్ 8వ తారీఖు 3 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం సుమారు 12గం పాటు మూసివేయనున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం…

Read More

వినాయక వ్రత విధానం

ఓం శ్రీ గురుభ్యోనమఃఓం శ్రీ మహా గణాధిపతయే నమఃఓం శనైశ్చరాయనమః వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి . ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను…

Read More

విద్యారంగంలో మరో మైలురాయిని అధిగమించిన గురునానక్ యూనివర్సిటీ

హైదరాబాద్, T6 న్యూస్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ యూనివర్సిటీ, తన విద్యా ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని సాధించింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) ఆమోదం పొందిన నూతన న్యాయ కోర్సులు — B.A. LL.B. (5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం) మరియు LL.B. (హానర్స్) (3 ఏళ్ల ప్రోగ్రాం) ప్రారంభించినట్లు గర్వంగా ప్రకటించింది.ఈ కోర్సులు విద్యార్థులకు నాణ్యత విద్యా, ప్రాక్టికల్ శిక్షణ మరియు నైతిక విలువలపై దృష్టి సారించేలా రూపొందించబడ్డాయని…

Read More

గురు నానక్ విద్య సంస్థలలో ఘనంగా జరిగిన ఒరియెంటేషన్ కార్యక్రమం

హైదరాబాద్, ఆగస్ట్ 20: ఇబ్రహీంపట్నం గురు నానక్ విద్యాసంస్థలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త విద్యార్థుల కోసం ఒరియెంటేషన్ కార్యక్రమం నూతన విద్యార్థులు మరియు వారి తల్లి తండ్రుల సమక్షంలో నేడు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం విద్యార్థుల జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడంతోపాటు, సంస్థ యొక్క విలువలు, దృష్టికోణం మరియు విద్యా సంస్కృతిని వారికి పరిచయం చేసింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ప్ర‌యాగ్ కన్స్యూమర్ కేర్ సంస్థలో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్…

Read More

డిల్లీ సీఎంపై దాడి.. హైటెన్షన్!

న్యూఢిల్లీ, ఆగస్టు 20: న్యూఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి జరిగింది. ఫిర్యాదుదారుడిలా వచ్చి సీఎం రేఖాగుప్తాపై ఒక వ్యక్తి దాడికి దిగాడు.బుధవారం సీఎం రేఖాగుప్తా జన్‌ సున్‌వాయ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీస్ లైన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. అతడి పేరు రాజేష్ సకారియగా గుర్తించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ అతడ స్వస్థలమని పోలీసులు పేర్కొన్నారు….

Read More