Headlines

ఇక సెలవు…

ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు గారి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. విలక్షణ నటనతో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన కోట శ్రీనివాసరావు మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More

గింజలు మరియు విత్తనాలు

బాదం, పొద్దుతిరుగుడు గింజలు మరియు వాల్‌నట్‌లు విటమిన్ E కి గొప్ప వనరులు, ఇది ఇన్ఫెక్షన్ల నివారణకు ఉపయోగపడుతుంది. విటమిన్ E అనేది యాంటీఆక్సిడెంట్, ఇది మీ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. 🍁అదనపు చక్కెర: ఎక్కువగా చక్కెర జోడించడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. చక్కెర స్నాక్స్, డెజర్ట్‌లు మరియు పానీయాలను తగ్గించండి. 🍁అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్: ఫాస్ట్ ఫుడ్ మరియు ప్యాక్ చేసిన స్నాక్స్ వంటి ఈ ఆహారాలు వాపును కలిగిస్తాయి మరియు…

Read More

ఘనంగా మహంకాళి బోనాలుఅమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్‌, జూలై 13: సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా శనివారం ఆలయంలో వైభవంగా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాలయానికి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. సంప్రదాయం మేరకు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇందుకు తోడు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాలను భక్తిశ్రద్ధలతో మోసుకుంటూ ఆలయానికి చేరుకున్న ఆమె,…

Read More

చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు…

పిల్లలు పెరిగేందుకు యువత అభిప్రాయం మారింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం యువత పిల్లలను కనడానికి ఆసక్తి చూపడం లేదు. దీనికి అనేక కారణాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా, ఖర్చులు పెరగడం, ఆదాయం కొరత వంటి సమస్యలు ఈ అభిప్రాయం మార్పుకు దారితీస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరుగుదలపై దృష్టి పెట్టడం అత్యవసరమని చంద్రబాబు…

Read More

రాజాసింగ్ రాజీనామా ఆమోదం..

హైదరాబాద్, T6 న్యూస్: తెలంగాణలో బీజేపీకి కీలక నేతలలో ఒకరైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన రాజీనామాను పార్టీ జాతీయ అధిష్ఠానం ఆమోదించింది. రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో తనను విస్మరించారనే అసంతృప్తితో రాజాసింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.—🔹 రాజీనామా నేపథ్యం:జూన్ 30న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాజాసింగ్ తన రాజీనామా లేఖను పంపారు.తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను పునర్నియమించడంపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం…

Read More

నకిలీ పత్రాలను సృష్టించి జగన్మోహన్ రావు అక్రమంగా అధ్యక్షుడయ్యాడన్న సీఐడీ

హైదరాబాద్,T6న్యూస్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల అక్రమాల కేసులో అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు మల్కాజ్‌గిరి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సీఐడీ అధికారులు ఆయనను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. జగన్మోహన్ రావుని సీఐడీ నిన్న అరెస్టు చేసిన విషయం విదితమే. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్ రావు నకిలీ పత్రాలను సృష్టించి అక్రమంగా హెచ్‌సీఏ అధ్యక్షుడయ్యాడని సీఐడీ ఆరోపిస్తోంది. గౌలీపురా క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్, మాజీ…

Read More

బీజేపీ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్,T6న్యూస్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌కు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎస్. మాధవ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో కూడిన పటాన్ని బహుమతిగా ఇవ్వడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల పోరాటాన్ని అవమానించడమేనని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని మోదీని ఉద్దేశించి ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు.ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి చర్య తెలంగాణ ప్రజలను, రాష్ట్రాన్ని, చరిత్రను అవమానించే విధంగా ఉందని కేటీఆర్ అభివర్ణించారు….

Read More

మయన్మార్‌లో చిక్కుకున్న యువత.. విదేశాంగ శాఖతో మాట్లాడిన పవన్ కల్యాణ్

విజయనగరం,T6న్యూస్: విజయనగరానికి చెందిన సూర్యకుమారి అనే మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఏజెంట్ చేతిలో మోసపోయిన తన ఇద్దరు కుమారులతో పాటు మరో ఆరుగురు యువకులు మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ వెంటనే కేంద్ర విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడారు. మయన్మార్ సరిహద్దుల్లో చిక్కుకున్న 8 మంది తెలుగు యువకులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Read More

కృష్ణా జలాలపై కీలక ప్రజెంటేషన్ – ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ సమీక్ష

ఏపీకి నీటి తరలింపు, కాళేశ్వరం డిజైన్ లోపాలపై వెల్లడి హైదరాబాద్‌:తెలంగాణ జలవనరులపై చోటుచేసుకుంటున్న వివాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక సమీక్ష సమావేశం నిర్వహించింది. నేడు (జూలై 9) మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలు శాఖల మంత్రులు, అధికారులు హాజరయ్యారు. 💧 ప్రధాన అంశాలు: 🔹…

Read More

ఆరోగ్యంగా ఉన్నా ఆకస్మాత్తుగా గుండెపోటు..?

ఆరోగ్యంగా ఉన్నా “సడన్​ హార్ట్​ ఎటాక్​” ఎందుకు వస్తుంది? – నిపుణుల సమాధానమిదే! రోజురోజుకు పెరుగుతున్న గుండెపోటు మరణాలు – ఈ అలవాట్లకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు! హైదరాబాద్, T6 న్యూస్ డెస్క్: నేటి రోజుల్లో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయని నిపుణులు చెబుతున్నారు. శారీరకంగా ఫిట్​గా ఉండి హైబీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు లేకపోయినా హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు వెల్లడిస్తున్నారు. మరి…

Read More