Headlines

డాక్టరేట్ పట్టా స్వీకరించిన ప్రవీణ

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ డా. వి. నారాయణన్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్. కుమార్ మోలుగారం చేతుల మీదుగా జియాలజీ డిపార్ట్మెంట్ లో ప్రవీణ మహేశ్వరం పీహెచ్ డి పట్టాను అందుకున్నారు. డా. ఎం ఎన్ రెడ్డి పర్యవేక్షణలో ” ఆదిలాబాద్ జిల్లాలోని పెద్దవాగు బేసిన్ నీటి నాణ్యత పై చేసిన పరిశోధనకు ఉస్మానియా యూనివర్సిటీ మార్చి 2024లో డాక్టరేట్ ను ప్రకటించింది.. ఈ సందర్బంగా పరిశోధనకు సహకరించిన ఉస్మానియా యూనివర్సిటీ జియాలజీ విభాగానికి మరియు ప్రొఫెసర్ ఎం నర్సింహా రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Please follow and like us:
Pin Share