
ఢిల్లీ,T6 న్యూస్: బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, లక్ష్మణ్ సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.
సమావేశంలో ప్రధానంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై విస్తృతంగా చర్చ జరిగింది. అభ్యర్థుల జాబితాను తుది దశకు తీసుకెళ్లి, ఆమోదం తెలపనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అదేవిధంగా, తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అభ్యర్థి ఎంపికపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ రోజు లేదా రేపటికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

