
హైదరాబాద్:
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత రావు కూతురు జసింత తోట ప్రముఖ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు.
ఆదివారం నాడు బంజారాహిల్స్ లో ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ పార్టీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తోట జసింత ను డిప్యూటీ సీఎం భట్టి,మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అభినందించారు. మరిన్ని ఉన్నత చదువులతో సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని వారు జసింతకు శుభాకాంక్షలు తెలిపి,ఆశీర్వదించారు.

